ధోనీకి భారతరత్న.. కాంగ్రెస్ కొత్త డిమాండ్..!

-

టీమిండియా మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనీ ఇంటర్నేషనల్ క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో సామాన్యులు మొదలు సెలబ్రిటీల వరకూ ఎంతోమంది ధోనీ రిటైర్మెంట్‌పై స్పందిస్తున్నారు. ధోనీ సేవలను కొనియాడుతూ.. ఎమోషనల్ అవుతున్నారు. అలాగే రకరకాల డిమాండ్లు సైతం వినిపిస్తున్నాయి. ఈ నేపధ్యంలో ధోనీకి భారతరత్న పురస్కారం ఇవ్వాలని మధ్యప్రదేశ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే పీసీ శర్మ డిమాండ్ చేశారు.

ఈ మేరకు ధోనీ దేశ ఆణిముత్యం.. క్రికెట్‌లో విజయాల ద్వారా ప్రపంచంలో భారత క్రికెట్ జట్టు ఖ్యాతిని పెంచాడు. అలాంటి వ్యక్తికి భారతరత్న ఇవ్వాలి’ అని తన ట్విటర్ లో రాసుకొచ్చాడు. ఇకపోతే ధోనీ ఇప్పటికే రాజీవ్ ఖేల్ రత్న, పద్మ శ్రీ పురస్కారం, పద్మభూషణ్ పురస్కారం అందుకున్న సంగతి తెలిసిందే. కాగా, ధోనీ రిటైర్మెంట్‌ ప్రకటించిన వెంటనే ఏ మాత్రం ఊహించని విధంగా ‘నీ దారిలోనే నడుస్తా’ అంటూ సురేశ్‌ రైనా కూడా రిటైర్మెంట్‌ ప్రకటించాడు.

Read more RELATED
Recommended to you

Latest news