బ్రో సినిమాపై ఎంపీ రఘురామ ఆసక్తికర వ్యాఖ్యలు

-

జనసేన అధినేత పవన్ కల్యాణ్ తాజా చిత్రం ‘బ్రో’ ఏపీ రాజకీయాల్లో కలకలం రేపింది. మంత్రి అంబటి రాంబాబును ఉద్దేశించిన డైలాగులు, ఆయన చేసిన తరహా డ్యాన్స్ ఈ చిత్రంలో ఉన్నాయి. దీంతో ఈ ఉదయం నుంచి దీనిపై రచ్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణ రాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

MP Raghurama Krishnam Raju complains to police against YSRCP MLAs

నీటి పారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు గురించి బ్రో సినిమాలో మంచి మంచి మాటలు ఉన్నాయని ఎంపీ రఘురామ కృష్ణరాజు ఎద్దేవా చేశారు. ఎంత సంపాదించినా పోవాల్సిందే అనే అంశాన్ని చెప్పారన్నారు. మార్గదర్శి పై పైశాచిక దాడిని ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి స్టార్ట్ చేశాడన్నారు. ఎవరు పిర్యాదు చేయకపోయినా మార్గదర్శి పై కేసు నమోదు చేశారని రఘురామ తెలిపారు. మరి ఇన్ని కంపెనీలు పెట్టిన సాయిరెడ్డి, జగన్మోహన్ రెడ్డి.. తండ్రి అధికారంలోకి రాగానే అల్లా ఉద్ధిన్ అద్భుత దీపం అయ్యినట్టు ఎలా సంపాదించారని ప్రశ్నించారు. రాజమండ్రిలో వైసీపీ రాజకీయ నాయకులు ఆవ భూముల్లో 150 కోట్లు మింగేశారన్నారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news