సీఎం కేసీఆర్ ప్రాణాల‌కు ముప్పు ఉందంటూ రేవంత్ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..

-

కేసీఆర్ ప్రాణాలకు ముప్పు ఉందని, ఆయనకు అనుక్షణం భద్రత కల్పించాల్సిన అవసరం ఉందని తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. గడ్డి అన్నారం మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ దరిపల్లి రాజశేఖర్‌ రెడ్డి కాంగ్రెస్‌లో చేరిన సందర్భంగా శనివారం కర్మన్‌ఘాట్‌లో రేవంత్‌ మాట్లాడారు. ఈ క్ర‌మంలోనే సీఎం కేసీఆర్, ఆయన కుటుంబాన్ని ఉద్దేశిస్తూ రేవంత్ చేసిన సంచ‌ల‌న వ్యాఖ్యలు చేశారు. పదవి కుటుంబసభ్యుల మధ్య కూడా చిచ్చు పెడుతుందన్నారు.

‘‘కేటీఆర్‌ను సీఎం చేయకపోతే అర్ధరాత్రి లేచి తండ్రిని మెత్త పెట్టి ఒత్తిండంటే ఏదైనా జరగరానిది జరగొచ్చు’’ అని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్‌ను ప్రగతి భవన్‌ నుంచి ఖాళీ చేయించాలని అన్నారు. అలాగే కేసీఆర్ కు భద్రతను మరింత పెంచాలని సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే రేవంత్ వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణలో తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఆయన వ్యాఖ్యల వెనుక మర్మం ఏంటని సీనియర్ రాజకీయ నేతలు, విశ్లేషకులు చర్చించుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news