గొంతు వినిపించేందుకు అవకాశం ఇవ్వండి : రేవంత్

-

జిహెచ్ఎంసి ఎన్నికల నేపథ్యంలో ప్రతి ఒక్కరు ఓటర్లను ఆకట్టుకునేందుకు తీవ్ర స్థాయిలో ప్రచారం నిర్వహిస్తున్నారు అనే విషయం తెలిసిందే. ఓటర్ మహాశయులకు ఆకర్షించడమే లక్ష్యంగా ప్రస్తుతం పావులు కదుపుతున్న అభ్యర్థులు ఎంతో వ్యూహాత్మకంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. అదే సమయంలో ఆయా పార్టీల పెద్దలు కూడా రంగంలోకి దిగి ప్రస్తుతం తమదైన వాక్చాతుర్యంతో ప్రసంగాలు చేస్తూ ఓటర్లను ఆకట్టుకునే పనిలో పడ్డారు ఈ క్రమంలోనే ఇటీవల తెలంగాణ కాంగ్రెస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు ఎంపీ రేవంత్ రెడ్డి ఇటీవలే ప్రచారంలో పాల్గొన్నారు.

జిహెచ్ఎంసి ఎన్నికల్లో ప్రతిపక్షాల గొంతు వినిపించేందుకు ప్రజలందరూ కాంగ్రెస్కు అవకాశం ఇవ్వాలి అంటూ ఈ సందర్భంగా ఎంపీ రేవంత్ రెడ్డి కోరారు. కాంగ్రెస్ పార్టీకి గ్రేటర్ ఎన్నికల్లో గెలిపించాలని లేదంటే కనీసం 30 సీట్లు అయినా వచ్చేలా చేస్తే అధికార పార్టీని ప్రశ్నించే గొంతుక ఉంటుంది అంటూ రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. జిహెచ్ఎంసి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే బల్దియాలో అద్భుతాలు చేసి చూపిస్తాం అంటూ వ్యాఖ్యానించారు రేవంత్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news