విజయసాయి ట్వీట్.. ఆ మరణాలకు మీరే కారణం..!

-

వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి, టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన కుమారుడు నారా లోకేష్ పై ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు.  ‘టీడీపీ ప్రభుత్వ హయాంలో ఈఎస్‌ఐ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ మరణించిన కార్మికుల వివరాలను ఆ సంస్థ బయట పెట్టాలి. వీరంతా నాసిరకం మందులు, నకిలీ డయాగ్నిస్టిక్ కిట్ల వల్ల వ్యాధి ముదిరి చనిపోయారు. కార్మికుల అకాల మరణాలకు అచ్చెన్న, పెదబాబు, చినబాబు బాధ్యత వహించాలి’ అని ఆయన ట్వీట్లు చేశారు. ‘వాళ్లంతా 20 వేల లోపు జీతాలు పొందే కార్మికులు. ఈఎస్‌ఐ సభ్యత్వం కింద నెలకు రూ.50-70 చెల్లిస్తారు. అనారోగ్యానికి గురైతే హాస్పిటల్లో మంచి చికిత్స దొరుకుతుందని ఆశపడితే, మీ బినామీ, అప్పటి కార్మిక మంత్రి అచ్చెన్న చేసిందేమిటి? 900 కోట్ల రూపాయల కుంభకోణానికి పాల్పడి కార్మికుల ఉసురు తీశారు’ అని విజయసాయిరెడ్డి తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news