గుడ్‌ న్యూస్‌… సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌లోకి ధోని

-

ఐపీఎల్‌ 2022 కు మరో రెండు నెలల సమయమే ఉండటంతో… అందరూ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓ వార్త వైరల్‌ గా మారింది. ధోని… సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టులో కలవనున్నాడని తెలుస్తోంది. అదేంటీ ధోని సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టులోకి రావడమేంటని అనుకుంటున్నారా ? అయితే.. దీనికి ఓ లెక్క ఉంది. ధోని సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టుతో కలవనున్న విషయం నిజమే కానీ ఆటగాడిగా కాదు.

పరోక్షంగా సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టులో ధోని ఈ సీజన్‌ లో పెట్టుబడులు పెడుతున్నాడు. చెన్నై కెప్టెన్‌ ధోనికి.. 2015 నుంచి కార్స్‌ 24 అనే సంస్థలో పెట్టుబడులున్నాయి. ఈ సంస్థకు ధోనినే స్వయంగా బ్రాండ్‌ అంబాసిడర్‌ గా కూడా పని చేస్తున్నారు. అయితే.. కార్స్‌ 24 అనే సంస్థనే ఈ ఏడాది ఏపీఎల్‌ 2022 గాను సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టు టైటిల్‌ స్పాన్సర్‌ షిప్‌ హక్కులు దక్కించుకుంది. దీంతో ఇది వరకే ధోని పెట్టుబడులు ఉన్న కార్స్‌ 24 సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఆటగాళ్ల జెర్సీలో ముందు భాగంలో ఉండనుంది. ఇలా ధోని హైదరాబాద్‌ కు పని చేయనున్నాడన్న మాట.

Read more RELATED
Recommended to you

Latest news