కంగన రనౌత్‌కు భారీ షాక్ ఇచ్చిన కోర్టు

-

బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ కు ఊహించని షాక్ తగిలింది. కంగనా రనౌత్ పై సాంగ్ రైటర్ జావేద్ అక్తర్ దాఖలుచేసిన పరువు నష్టం దావా పై విచారణ జరుపుతున్న ఆందేరి మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ నిష్పక్షపాతంగా నే వ్యవహరించారని అడిషనల్ చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు పేర్కొంది. ఈ పిటిషన్పై విచారణను వేరొక కోర్టుకు బదిలీ చేయాలని కంగనా దాఖలు చేసిన పిటిషన్ను కోర్టు తోసిపుచ్చింది. ఈ మేరకు అడిషనల్ చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ఎస్టి దండే తీర్పు ఇచ్చారు.

ఈ ఆదేశాలు శనివారం పూర్తిగా అందుబాటులోకి వచ్చాయి. కంగనా పై జావేద్ అక్తర్ దాఖలుచేసిన పరువు నష్టం దావా పై విచారణ జరుపుతున్న… అంధేరి మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్… నిస్పక్షపాతంగా వివేకంతో వ్యవహరించారని దండే పేర్కొన్నారు.

కంగనా రనౌత్ కు వ్యతిరేకంగా ఎలాంటి పక్షపాతం ప్రదర్శించ లేదని తేల్చి చెప్పారు. కంగనా దాఖలు చేసిన దరఖాస్తులో.. తనకు అంధేరి మెట్రో పాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు పై నమ్మకం పోయిందని తెలిపారు. బెయిల్ మంజూరు చేయదగిన నేరానికి సంబంధించిన కేసులో కోర్టుకు హాజరు కాకపోతే తనకు వారెంట్ జారీ చేస్తామని పరోక్షంగా ఈ కోర్టు బెదిరించి ఉందని ఆరోపించారు. అయితే కంగనా రనౌత్ ఆరోపణలను అందేరి మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు తోసిపుచ్చింది.

Read more RELATED
Recommended to you

Latest news