నిమిషాల వ్యవధిలో హత్యలు చేసిన సైకో…పోలీసుల విచారణ షాకింగ్ విషయాలు..

-

పగతో హత్య చేస్తారు కొంతమంది.. క్షణికావేశంతో హత్య చేస్తారు.. ఏదైనా ఆశించి హత్య చేసేవారు మరికొందరు. అయితే కొంతమంది మాత్రం సరదా కోసం, తమ పైశాచిక ఆనందం కోసం హత్యలు చేస్తుంటారు సైకోలు. సరిగ్గా ఇలాంటి సంఘటనే ముంబైలో ఆలస్యంగా వెలుగు చూసింది. ఒక హత్య గురించి విచారిస్తే మరో హత్య బయటకు వచ్చింది. 15 నిమిషాల వ్యవధిలో ఇద్దరిని హత్య చేసిన ఆ సైకో పోలీసులకు చిక్కాడు.

వివరాల్లోకి వెళితే.. కర్ణాటక రాష్ట్రానికి చెందిన సురేష్ శంకర్ గౌడ ముంబైలో చెత్త ఏరుకుని జీవనం సాగిస్తున్నాడు. ఈ నెల 23న ముంబై లోని జేజే మార్గ్ లో ఫుట్ పాత్ పై నిద్రిస్తున్న ఓ వ్యక్తిని చూశాడు. తన బుర్రలో ఏం అనుకున్నాడో తెలీదు కానీ.. దగ్గర ఉన్న ఇటుకతో సదరు యాచకుడి తల పగలకొట్టి చంపేశారు. హత్య విషయం తెలిసిన పోలీసులు విచారణ ప్రారంభించారు. హత్య చేసిన విషయం దగ్గరలో ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. దీంతో విచారణ ప్రారంభించిన పోలీసులకు విస్తు పోయే నిజాలు తెలిశాయి.

ఇది రీతిన 15 నిమిషాల ముందు మరో వ్యక్తిని హత్య చేసినట్లు నిందితుడు పోలీసులకు తెలిపాడు. షాక్ అవ్వడం పోలీసుల వంతైంది. జేజే మార్గ్ లో హత్యకు ముందు బైకుల్లాలో కూడా బండతో మోది మరో వ్యక్తిని హత్య చేశాడు. కాగా ప్రస్తుతం పోలీసులు నిందితుడి నుంచి మరిన్ని విషయాలు రాబట్టే పనిలో ఉన్నాడు. ఇప్పటి వరకు సైకో ఎన్నిహత్యలు చేశాడనే వివరాలను కనుక్కునే ప్రయత్నంలో ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news