విజృంభించిన ముంబై.. కోల్‌క‌తా టార్గెట్ 196..

-

అబుధాబి వేదిక‌గా జ‌రుగుతున్న ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ 5వ మ్యాచ్ లో ముంబై ఇండియ‌న్స్ విజృంభించింది. కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్ జ‌ట్టు టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోగా ముంబై బ్యాటింగ్ చేపట్టింది. ఈ క్ర‌మంలో నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో ముంబై 5 వికెట్ల న‌ష్టానికి 195 ప‌రుగులు చేసింది.

mumbai made 195 for 5 wickets in ipl 2020 5th match against kolkata

ముంబై బ్యాట్స్‌మెన్ల‌లో కెప్టెన్ రోహిత్ శ‌ర్మ (80 ప‌రుగులు, 3 ఫోర్లు, 6 సిక్స‌ర్లు), సూర్య‌కుమార్ యాద‌వ్ (47 ప‌రుగులు, 6 ఫోర్లు, 1 సిక్స‌ర్‌)లు రాణించారు. దీంతో ముంబై భారీ స్కోరు చేయ‌గ‌లిగింది. ఇక కోల్‌క‌తా బౌల‌ర్ల‌లో శివం మావికి 2 వికెట్లు ద‌క్క‌గా, సునీల్ న‌రైన్‌, ఆండ్రూ ర‌స్సెల్‌లు చెరొక వికెట్ తీశారు.

Read more RELATED
Recommended to you

Latest news