హైదరాబాద్ పాతబస్తీలో దారుణ హత్య

-

హైదరాబాద్ పాత బస్తీలో దారుణ హత్య జరిగింది. నగర శివారు పహడి షరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జల్పల్లి చెరువు సమీపంలోని రాళ్ళ గుట్టలో ఈ మర్డర్ జరిగింది. నిర్మానుష్య ప్రదేశం రాళ్ళ మధ్యలో మృతదేహం ఉన్నట్లు సమాచారం అందుకున్న పహడి షరీఫ్ పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి క్లూస్ టీంను రప్పించి ఆధారాలు సేకరించారు. మృతదేహాన్ని బయటకు తీసి పోస్ట్ మార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు.

మృతుడు రాజేంద్ర నగర్ రౌడి షీటర్ సయ్యద్ వహేద్ అలీ గా పోలీసులు నిర్ధారించారు. మృతదేహం పైన పదునైన వస్తువుతో దాడి జరిగిన గాయాలు ఉండడంతో హత్య కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. గుర్తు తెలియని దుండగులు ఇక్కడ తీసుకువచ్చి హత్య చేసినట్లు ఆనవాళ్లు ఉన్నాయని ఏసీపీ శంకర్ తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news