ఐపీఎల్ 27వ మ్యాచ్‌.. ముంబై టార్గెట్ 163..

-

అబుధాబిలో జ‌రుగుతున్న ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ 2020 టోర్నీ 27వ మ్యాచ్‌లో ముంబై ఇండియ‌న్స్‌పై ఢిల్లీ క్యాపిట‌ల్స్ 162 ప‌రుగుల స్కోరు చేసింది. మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఢిల్లీ ముందుగా బ్యాటింగ్ చేపట్టింది. ఈ క్ర‌మంలో ఆ జ‌ట్టు నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 4 వికెట్ల న‌ష్టానికి 162 ప‌రుగులు చేసింది.

delhi made 162 runs against mumbai in ipl 2020 27th match

ఢిల్లీ బ్యాట్స్‌మెన్ల‌లో శిఖ‌ర్ ధావ‌న్‌, కెప్టెన్ శ్రేయాస్ అయ్య‌ర్‌లు రాణించారు. 52 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స‌ర్‌తో ధావ‌న్ 69 ప‌రుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. అలాగే అయ్య‌ర్ 33 బంతుల్లో 5 ఫోర్లతో 42 ప‌రుగులు చేశాడు. ముంబై బౌల‌ర్ల‌లో హార్ధిక్ పాండ్యా 2 వికెట్లు తీయ‌గా, ట్రెంట్ బౌల్ట్‌కు 1 వికెట్ ద‌క్కింది. మ‌రొక వికెట్ ర‌నౌట్ రూపంలో ల‌భించింది.

కాగా ఆరంభంలో ఢిల్లీ త‌డ‌బ‌డినా ధావ‌న్, అయ్య‌ర్‌లు క్రీజులో నిల‌దొక్కుకున్నారు. కొంత సేపు స్కోరు బోర్డును ప‌రుగెత్తించారు. అనంత‌రం అయ్య‌ర్ నిష్క్ర‌మించ‌గా త‌రువాత వ‌చ్చిన బ్యాట్స్‌మెన్‌తో ధావ‌న్ నిల‌క‌డ‌గా ఆడుతూ ఢిల్లీకి గౌర‌వ ప్ర‌ద‌మైన స్కోరు అందించాడు.

Read more RELATED
Recommended to you

Latest news