దారుణం: భూవివాదంలో దంపతులపై కత్తితో దాడి …!

-

రోజురోజుకి మనుషుల మధ్య మానవతా సంబంధాలు దెబ్బతింటున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా తెలంగాణ రాష్ట్రంలోని వనపర్తి జిల్లాలో ఉన్న గోపాలపేట మండలం బుద్ధారం లో దారుణ సంఘటన చోటు చేసుకుంది. మూడేళ్ల సమయం నుండి రెండు కుటుంబాల మధ్య భూ జరుగుతున్న వివాదంతో గొడవల కారణంగా మారణాయుధాలతో దాడి చేసుకునే వరకు వెళ్ళింది. ఈ విషయం కు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే… అర్జునరావు అనే వ్యక్తి రత్నమ్మ, అనంతరావు అనే దంపతులపై కత్తితో విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డాడు. ఈ సంఘటనలో వారిద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. ఈ నేపథ్యంలో వారిద్దరినీ హైదరాబాద్ కు మెరుగైన చికిత్స కోసం తరలించారు.

murder
murder

అయితే సమాచారం మేరకు రత్నమ్మ కు ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. రత్నమ్మ అనంతరావు లపై అర్జున రావు దాడి చేసిన సమయంలో నిజానికి ఆ ప్రాంతంలో పదుల సంఖ్యలో జనం చూస్తున్న కానీ, ఎవరు పట్టించుకోకపోవడం శోచనీయం. అయితే ఈ సమయంలో రత్నమ్మ పై అర్జున రావు అనే వ్యక్తి కత్తితో దాడి చేస్తున్న సమయంలో ఓ వ్యక్తి వీడియో ని తీసి సమాజ మాధ్యమాలలో షేర్ చేయడంతో ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన పోలీస్ అధికారులు కేసు నమోదు చేసుకొని నిందితుడి కోసం దర్యాప్తు చేపడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news