భార్యను కిరాతకంగా హతమార్చి… ఏకంగా తలతో..

-

హైదరాబాద్ లో దారణం జరిగింది. అత్యంత కిరాతకంగా భార్యను హతమర్చాడో భర్త.. వివాహేతర సంబంధం పెట్టుకుందనే అనుమానంతో భర్త, భార్యను హత్యచేశారు. ఈ ఘటన రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇమాద్ నగర్ లో ఈ దారుణం చోటు చేసుకుంది. నిద్రిస్తున్న భార్య గొంతు కోసి చంపాడు భర్త పర్వేజ్. ఆ తరువాత సమ్రిన్ తనను నరికి..  తలతో పాటు పోలీస్ స్టేషన్ కు వెళ్లి లొంగిపోయాడు. తెల్లవారు జామున 4 గంటలకు ఈ ఘటన చోటు చేసుకుంది.

కాగా 14 ఏళ్ల క్రితం సమ్రిన్ తో పర్వేజ్ కు వివాహం అయింది. అయితే భర్త వేధింపుల తాలలేక గతంలో సమ్రిన్ విడాకులు తీసుకుంది. ఇదిలా ఉంటే సమ్రిన్ బేగంకు నచ్చచెప్పి పర్వేజ్ మళ్లీ ఆమెను గతేడాది వివాహం చేసుకున్నాడు. భార్యపై అనుమానం పెంచుకున్న పర్వేజ్.. సమ్రిన్ బేగంను హత్య చేసినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. గంజాయికి అలవాటు పడ్డ పర్వేజ్.. ఆ మత్తులోనే ఈ ఘాతుకానికి పాల్పడ్డట్లు తెలుస్తోంది. సమ్రీన్ బేగంకు ఇాద్దరు కుమారులు, ఓ కుమార్తె ఉంది.  తలతో పోలీస్ స్టేషన్ కు నిందితుడు రావడం కలకలం కలిగించింది. పోలీసులు హుటాహుటీనా సంఘటన స్థలానికి వెళ్లారు. డెడ్ బాడీని ఉస్మానియా ఆసుపత్రి మార్చురీకి తరలించారు.

Read more RELATED
Recommended to you

Latest news