వరంగల్ లో దారుణ హత్య..

-

వరంగల్ నగరంలోని మండి బజార్ లో రాజ్ కుమార్ అనే వ్యక్తి హత్యకు గురయ్యాడు. దేశాయి పేటకు చెందిన రాజ్ కుమార్ ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. రాజ్ కుమార్ కు భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆదివారం రాత్రి పని ఉండి మండి బజార్ కి వచ్చిన రాజ్ కుమార్ ని గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో పొడిచి హత్య చేశారు.

murder
murder

కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేస్తున్నారు. హత్యకు గల కారణాల పై కుటుంబ సభ్యుల నుంచి వివరాలు రాబడుతున్నారు. పాత కక్ష లే ఈ హత్యకు కారణంగా పోలీసులు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. పోస్టుమార్టం కోసం వరంగల్ ఎంజీఎం డెడ్ బాడీని తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు అందాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news