హిందూ దత్త పుత్రికకు పెండ్లి చేసిన ముస్లిం దంపతులు

-

దేశంలో మతసామరస్యానికి ప్రతీకగా నిలిచే ఘటన తాజాగా కేరళ రాష్ట్రం, కాసరగోడ్‌ పట్టణంలో జరిగింది. కాసర్‌గోడ్‌కు చెందిన అబ్దుల్లా, ఖదీజా దంపతులు చేసిన పని స్థానికంగా మత సామరస్యం వెల్లివిరిసేలా చేసింది. ఇంతకు ఆ ముస్లిం దంపతులు ఏం చేశారో తెలుసా..? హిందువైన తమ దత్తపుత్రిక రాజేశ్వరిని విష్ణు ప్రసాద్‌ అనే మరో హిందూ యువకుడికి ఇచ్చి ఘనంగా వివాహం జరిపించారు.

కాసర్‌గోడ్‌కు చెందిన అబ్దుల్లా, ఖదీజా దంపతుల రాజేశ్వరి తండ్రి పొలం పనులు చేసేవాడు. అయితే అనారోగ్యం కారణంగా రాజేశ్వరి చిన్నపిల్లగా ఉన్నప్పుడే ఆయన చనిపోయాడు. ఆ తర్వాత కొంత కాలానికే రాజేశ్వరి తల్లి కూడా మరణించింది. దీంతో అనాథగా మారిన రాజేశ్వరిని అబ్దుల్లా, ఖదీజ దంపతులు పెద్దమనసు చేసుకుని దత్తత తీసుకున్నారు.

అబ్దుల్లా దంపతులకు అప్పటికే షమీమ్‌, నజీబ్‌, షరీఫ్‌ అనే ముగ్గురు కొడుకులున్నారు. వారితోపాటే రాజేశ్వరిని కూడా అబ్దుల్లా దంపతులు కన్నకూతురులా పెంచిపోషించారు. ఇప్పుడు పెళ్లీడు రావడంతో మంచి సంబంధం చూసి పెండ్లి చేశారు. విష్ణు్ ప్రసాద్‌ తరఫున వచ్చిన హిందూ బంధుమిత్రలు, రాజేశ్వరి తరఫున వచ్చిన ముస్లిం బంధుమిత్రుల సమక్షంలో ఈ పెండ్లి కన్నులపండువలా జరిగింది. కాగా, ఈ విషయం తెలిసిన ప్రతి ఒక్కరూ అబ్దుల్లా దంపతుల ఔదార్యాన్ని మెచ్చుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news