తమిళ దర్శకుడితో నాగచైతన్య మూవీ ఫిక్స్..

-

ఇటీవల రిలీజ్ అయిన “బంగార్రాజు” సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నాడు అక్కినేని నాగచైతన్య. ప్రస్తుతం చైతు ‘థాంక్యూ’ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. విక్రమ్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కథానాయికగా రాశికన్నా అలరించనుంది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకులను అలరించనుంది. ఈ సినిమా తరువాత చైతు.. ‘తమిళ దర్శకుడు ‘ వెంకట్ ప్రభు తో ఒక సినిమా రూపొందించనున్నట్లు వార్తలు వచ్చాయి.

తాజాగా ఈ కాంబినేషన్ నుంచి అధికారిక ప్రకటన వచ్చింది. శ్రీనివాస చిట్టూరి ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు.తమిళంలో దర్శకుడిగా వెంకట్ ప్రభు కి మంచి పేరు ఉంది. తెలుగుతో పాటు తమిళంలోనూ ఈ సినిమాను విడుదల చేయనున్నారు చిత్రబృందం. ఈ సినిమాలో కథానాయికగా పూజా హెగ్డే పేరు తెరపైకి వచ్చింది.అయితే అధికారికంగా ఇంకా ప్రకటన రాలేదు.తెలుగులో పూజా హెగ్డే తన మొదటి సినిమా చైతు తో చేసిన సంగతి తెలిసిందే.కెరీర్ పరంగా సైజు ఇది 22వ సినిమా.

Read more RELATED
Recommended to you

Latest news