మంత్రి పదవి రానివారిని చూస్తే.. అయ్యో పాపం అనిపించింది : నాగబాబు

-

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కేబినెట్ తాజాగా కొలువుదీరిన సంగతి తెలిసిందే. ఇవాళ ఉదయం 11 గంటల సమయంలో 25 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ ప్రమాణస్వీకారం ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ ఆధ్వర్యంలో జరిగింది. అయితే ఆంధ్రప్రదేశ్ కొత్త కేబినెట్ ఏర్పాటు పై నాగబాబు సెటైర్ వేశారు.

వైసీపీలో మంత్రి పదవులు రాని వారు, మంత్రి పదవులు పోయిన వారి బాధ, కుమిలి పోవడం కొంతమంది కన్నీళ్లు పెట్టుకోవడం చూస్తే తనకు బాదేస్తుందని… అయ్యో పాపం అనిపించింది అని కామెంట్ చేశారు నాగబాబు.

అయితే కౌలు రైతుల ఆత్మహత్యలు, ఇతర ఉత్పత్తి కులాల లో చనిపోయిన ప్రజలు, ఉద్యోగాలు రాని యువత, అమరావతి రాజధాని ప్రజల కడుపు మంట, ఉద్యోగులు పడుతున్న బాధలు, నాశనం అయిపోయిన మౌలిక సదుపాయాలు, ఆ సదుపాయాలు లేక నిత్యం చేస్తున్న ప్రజలు… వారు పడుతున్న బాధలు పైన ఇదే కన్నీరు బాధ వారి పై ప్రేమ చూపిస్తే బాగుంటుందని వారికి చురకలంటించారు నాగబాబు. ఈ మేరకు తన సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు.

Read more RELATED
Recommended to you

Latest news