కేసీఆర్ ఇక్కడేం పీకలేక ఢిల్లీ పోయాడు: బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

-

ఢిల్లీ లో “వరి పొరు”పై దీక్ష చేస్తున్న కేసీఆర్ ను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.కెసిఆర్ కు వయసు పైబడి మతిస్థిమితం కోల్పోయాడని అన్నారు సంజయ్.కళ్ళు మూసుకొని తెరిచేలోపు ఢిల్లీలో కేసీఆర్ దీక్ష ముగిసిందన్నారు.ఢిల్లీ దీక్షలో కెసిఆర్ మాట్లాడుతూ కొందరు బీజేపీ నాయకులు కుక్కలు అని సంబోధించారని, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఒక సింహం లాంటివారు అని.భారతదేశాన్ని ఒక శక్తివంతమైన దేశం గా తీర్చిదిద్దిన మోడీ గారి నాయకత్వంలో పని చేసే ప్రతి ఒక్క కార్యకర్త కూడా సింహం లాంటి వారేనని అన్నారు.

తెలంగాణ రాష్ట్రంలో సంక్షోభం ఏర్పడిందని, ఆర్టీసీ చార్జీల పెంంపు, రిజిస్ట్రేషన్ చార్జీల పెంపు, కరెంటు చార్జీల పెంపు, 10 తారీకు వచ్చిన ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు చెల్లించలేదని, ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారని అన్నారు బండి సంంజయ్.వీటన్నిటినీ దృష్టి మరల్చడానికి ఢిల్లీలో కేసీఆర్ దీక్ష చేస్తున్నారని అన్నారు.ఇక్కడ ఏం పీకలేక ఢిల్లీకి పోయి దీక్ష చేస్తున్నారని దుయ్యబట్టారు సంజయ్.

Read more RELATED
Recommended to you

Latest news