నాగర్జున సాగర్‌ లో పడి వైసీపీ ఎమ్మెల్యే సోదరుడి భార్య, కుమార్తె మృతి

-

గుంటూరు జిల్లా మాచర్చ వైసీపీ ఎమ్మెల్యే ఇంట విషాదం చోటు చేసుకుంది. నాగార్జున సాగర్‌ కుడి కాలువలో పడి వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి సోదరుడి భార్య తో పాటు, వారి కుమార్తె మృతి చెందారు. ఈ ఘటన వివరాల్లోకి వెళితే… నాగార్జున సాగర్‌ కుడి కాలువలోకి వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి సోదరుడి భార్య వెలుతున్న కారు దూసుకెళ్లింది.

దీంతో వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి సోదరుడి భార్యతో పాటు, కుమార్తె అక్కడిక్కడే మృతి చెందారు. ఈ సంఘటన జిల్లాలోని దుర్గి మండలం అడిగొప్పల వద్ద చోటు చేసుకుంది. రాత్రి సాగర్‌ కుడి కాలువలోకి కారు దూసుకెళ్లాగా… స్థానికులు వెంటనే ఎమ్మెల్యే సోదరుడు మదన్‌ మోహర్‌ రెడ్డిని కాపాడారు. అయితే.. ఆయన భార్య, ఇద్దరు పిల్లల కోసం గాలింపు చేపట్టిన ఫలితం లేకుండా పోయింది. ఇక సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు… సహాయక చర్యలు చేపట్టారు. రాత్రి సమయం కావడంతో గాలింపు చర్యలకు అంతరాయం ఏర్పడింది.

Read more RELATED
Recommended to you

Latest news