BREAKING : వంగవీటి రాధాకు కరోనా పాజిటివ్‌… హైదరాబాద్ తరలింపు

-

ఇండియాలో కరోనా థర్డ్‌ వేవ్‌ రోజు రోజుకు విజృంభిస్తూనే ఉంది. ఈ మ‌ధ్య కాలంలోనే చాలా మంది ప్ర‌ముఖులు ముఖ్య రాజ‌కీయ నాయ‌కులు కరోనా బారిన ప‌డుతున్నారు. తాజాగా టీడీపీ పార్టీ సీనియర్‌ నేత వంగవీటి రాధాకు కరోనా పాజిటివ్‌ గా నిర్ధారణ అయింది. గత రెండు రోజుల నుంచి తీవ్ర అస్వస్థతకు గురైన వంగవీటి రాధా… తాజాగా కరోనా పరీక్షలు చేయించుకున్నారు.

అయితే.. ఈ పరీక్షల్లో ఆయనకు కరోనా పాజిటివ్‌ గా నిర్ధారణ అయింది. అయితే.. కరోనా స్వల్ప లక్షణాలతో వంగవీటి రాధా ఆస్పత్రిలో చేరారు. ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఏఐజీ ఆస్పత్రిలో వంగవీటి రాధాకు చికిత్స అందిస్తున్నారు వైద్యులు. ఆయన ఆరోగ్యం చాలా నిలకడగానే ఉందని వైద్యులు చెబుతున్నారు. కాగా.. ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్ర మంత్రి కొడాలి నానికి కూడా కరోనా వైర‌స్ సోకింది. దీంతో మంత్రి కొడాలి నాని క‌రోనా చికిత్స కోసం హైద‌రాబాద్ లోని ఏఐజీ ఆస్ప‌త్రికి వ‌చ్చారు. అదే ఆస్పత్రికి వంగవీటి రాధా కూడా వెళ్లారు.

Read more RELATED
Recommended to you

Latest news