ముగిసిన నాయిని అంత్యక్రియలు..పాడె మోసిన కేటీఆర్‌

-

తెలంగాణ మాజీ హోంమంత్రి,కార్మిక పక్షపాతి నాయిని న‌ర్సింహారెడ్డి అంత్య‌క్రియ‌లు జూబ్లీహిల్స్‌లోని మ‌హాప్ర‌స్థానంలో ముగిశాయి..ప్ర‌భుత్వం అధికారిక లాంఛ‌నాల‌తో అంత్య‌క్రియ‌లు నిర్వ‌హించారు..అంత్య‌క్రియ‌ల్లో భాగంగా నాయిని పాడెను మంత్రులు కేటీఆర్, శ్రీనివాస్‌గౌడ్ పాడె మోసి నివాళుల‌ర్పించారు.

నాయినిని క‌డ‌సారి చూసేందుకు అభిమానులు భారీగా సంఖ్యలో త‌ర‌లివ‌చ్చారు..అనారోగ్యంతో బాధపడుతున్న నాయిని స‌తీమ‌ణి మ‌హాప్ర‌స్థానానికి వచ్చి భర్తను కడసారి చూసుకున్నారు..భ‌ర్త‌ను చూసేందుకు ఆమె వీల్‌చైర్‌లోనే మ‌హాప్ర‌స్థానానికి చేరుకుని శ్ర‌ద్ధాంజ‌లి ఘ‌టించారు. భ‌ర్త‌ను త‌లుచుకుంటూ ఆమె క‌న్నీరుమున్నీరు అయ్యారు.

Read more RELATED
Recommended to you

Latest news