నల్లగొండ జిల్లాలో ఘోరం

-

నల్లగొండ జిల్లా తిరుమలగిరి సాగర్ మండలం జువ్వి చెట్టు తండాలో గురువారం రాత్రి సపావత్ బాబు అనే వ్యక్తి పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కుటుంబ కలహాలతోనే సపావత్ బాబు ఆత్మహత్య చేసుకున్నాడని తెలిపారు. బాబు మంటలకు తట్టుకోలేక కేకలు వేయడంతో స్థానికులు వచ్చి మంటలు అదుపు చేశారు. అప్పటికే వ్యక్తి పూర్తిగా కాలిపోయాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. అసలు ఆత్మహత్య ఎందుకు చేసుకున్నాడు. దానికి కారణాలేంటి అనేది తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news