దొంగ ఓట్లకు బ్రాండ్ తెచ్చిందే వైసిపి – నల్లారి కిషోర్

-

కుప్పంలో మెజర్టీ బోగస్ ఓట్లు అన్న వైసిపి మాటలపై నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి ఫైర్ అయ్యారు. అసలు దొంగ ఓట్లుకు బ్రాండ్ తెచ్చిందే వైసిపి అని ఆరోపించారు. గత కుప్పం మున్సిపల్ ఎన్నికలు, తిరుపతి ఉప ఎన్నికలలో తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుండి దొంగ ఓటర్లను తీసుకొచ్చింది వైసిపి కాదా? అని ప్రశ్నించారు.

ఎన్నికలకు భయపడి ఏకగ్రీవం చేసుకునే వైసిపి కూడా ఓట్లు, ఓటర్లు గురించి మాట్లాడం విడ్డూరంగా ఉందన్నారు. పుంగనూరులో నిజమైన ఓటర్లు ఓటు వేసుకోకుండా అడ్డుకునే మీరా బోగస్ ఓట్ల గురించి మాట్లాడేదని మండిపడ్డారు నల్లారి కిషోర్. వైసిపికి గెలిచే దమ్ము లేక ఇలాంటి ఆరోపణ చేస్తోందన్నారు. వాళ్ళు ఎక్కడైనా ఫిర్యాదు చేసుకోవచ్చని.. కుప్పంలో గెలుపు టిడిపిదేనని ధీమా వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news