హైదరాబాదీలకు గుడ్ న్యూస్.. 25 నుంచి నాంపల్లి ఎగ్జిబిషన్ పునఃప్రారంభం

-

హైదరాబాద్ మహానగర వాసులను అదిరిపోయే శుభవార్త అందింది. కరోనా మహమ్మారి కేసులు ఒక్కసారిగా తగ్గుముఖం పట్టడంతో… నాంపల్లి ఎగ్జిబిషన్ మళ్లీ ప్రారంభం కాబోతుంది. ఈ మేరకు సొసైటీ కార్యదర్శి ఆదిత్య మార్గమున అధికారిక ప్రకటన చేశారు. జనవరి ఒకటో తేదీన 81వ అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ప్రారంభించనున్నారు.

ముమైత్ ఖాన్ వ్యాప్తి నేపథ్యంలో రెండవ తేదీన అర్ధాంతరంగా నాంపల్లి ఎగ్జిబిషన్ ను మూసి వేశారు. ప్రస్తుతం తెలంగాణలో కరోనా మహమ్మారి కేసులు బాగా తగ్గుముఖం పట్టాయి. కేసులు తగ్గటంతో… రాష్ట్రంలో అంశాలను కూడా ఎత్తివేసింది కేసీఆర్ సర్కార్.

దీంతో ఈ నెల 25 నుండి నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో నుమాయిష్ పునః ప్రారంభం కానుంది. జనవరి 1న ప్రారంభించి, జనవరి 3 నుండి కరోనా ఆంక్షల కారణంగా మూసివేసిన నుమయిష్ కమిటీ.. వచ్చే 25 వ తేదీన ప్రారంభిస్తోంది. కరోనా ఆంక్షలు పాటిస్తూనే.. నాంపల్లి ఎగ్జిబిషన్ ను కొనసాగిస్తామన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news