సీఎం జగన్, వైసీపీ నేతలకు నారా లోకేష్ ఛాలెంజ్.. 24 గంటల డెడ్‌లైన్

-

ఆంధ్ర ప్రదేశ్‌ సీఎం జగన్‌ కు తనపై ఆరోపణలు చేస్తున్న వైసీపీ పార్టీ నాయకులకు టీడీపీ నేత నారా లోకేష్‌ 24 గంటల సవాల్‌ విసిరారు. స్కిల్‌ డెవలప్‌ మెంట్‌ కు సంబంధించి.. తనపై చేస్తున్న ఆరోపణలపై దమ్ముంటే, 24 గంటల్లోనే ఆధారాలు బయటపెట్టాలని తన ట్విట్టర్‌ వేదికగా సవాల్‌ చేశారు టీడీపీ నేత నారా లోకేష్‌.

తనపై ఆరోపణలు చేసి… పారిపోవడం వైసీపీ పార్టీ నేతల కు అలవాటని ఫైర్‌ అయ్యారు.వైసీపీ పార్టీ నేతల మాదిరిగా అందరూ అవినీతి పరులేనని.. ప్రజలను మభ్య పెట్టడానికే బురద జల్లే కార్యక్రమం చేస్తున్నారని ఓ రేంజ్‌ లో టీడీపీ నేత నారా లోకేష్‌ మండిపడ్డారు.

ఇప్పుడు నాపై చేస్తున్న అన్ని ఆరోపణలను నిరూపించేందుకు 24 గంటల సమయం ఇస్తున్న. స్కిల్ డెవలప్మెంట్ సహా నాపై చేసిన ఆరోపణల్లో ఆధారాలు బయటపెట్టాలి. మరి ఈ ఆరోపణలపై ఆధారాలు బయటపెడతారో లేదో వేచి చూద్దాం. ఏదైనా ఉంటే నాపై నేరుగా పోరాడాలి. ఇలాంటి ఫేక్ ఆరోపణలు చేయకూడదు అంటూ లోకేష్ ట్వీట్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news