జగన్ కు చంద్రబాబుపై ఇంకా కక్ష తీరలేదు:నారా లోకేష్

-

తాజాగా చంద్రబాబు నాయుడు ములాఖత్ లో భాగంగా నారా లోకేష్ తో ప్రజలను ఉద్దేశించి కొన్ని ఎమోషనల్ విషయాలను పంచుకున్నారు. కానీ ఈ కామెంట్స్ ను ఒక లేఖ రూపంలో తయారు చేసి టీడీపీ నేతలు ప్రజలకు విడుదల చేశారు. ప్రస్తుతం ఈ విషయంపై తీవ్ర చర్చనీయాంశం అవుతోంది. కానీ తెలుస్తున్న సమాచారం ప్రకారం జైలు అధికారులు చంద్రబాబు ఎటువంటి లేఖ రాయలేదని ఇప్పటికే స్పందించారు. తాజాగా లోకేష్ దీనిపై స్పందిస్తూ భహిరంగ లేఖ రాయడం కూడా దేశ ద్రోహం కిందకు వస్తుందా అంటూ ప్రశ్నించారు. ములాఖత్ లో భాగంగా నాన్న మాతో పంచుకున్న విషయాలను లెటర్ లో ఉన్నాయి. మాములుగా చంద్రబాబు జైలు లోకి వెళ్తున్న వీడియోలు బయటకు వస్తున్నప్పుడు ఇదే అధికారులకు రూల్స్ గుర్తుకు రాలేదా ? ఇప్పుడు మాత్రం ఎందుకు ఈ విషయాన్ని హైలైట్ చేస్తున్నారు అంటూ లోకేష్ విమర్శించారు.

చంద్రబాబును జైల్లో పెట్టినా ఇంకా జగన్ ను మా నాన్నమీద కక్ష తీరినట్లు లేదు అంటూ బాధతో అన్నాడు.

Read more RELATED
Recommended to you

Latest news