నారా లోకేష్: జగన్ రాష్ట్రాన్ని గంజాయి రాష్ట్రంగా మార్చాడు…

-

ఆంధ్రప్రదేశ్ లో యువగలం పేరుతో నారా లోకేష్ చేస్తున్న పాదయాత్ర ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో కొనసాగుతోంది. ఈ సందర్భంగా ముత్తుకూరులో జరిగిన మీటింగ్ లో లోకేష్ సీఎం జగన్ పై కొన్ని కీలక విమర్శలు చేశాడు. ఈయన మాట్లాడుతూ… రాష్ట్రములో యువగలం పాదయాత్రకు రెస్పాన్స్ అద్భుతంగా వస్తోంది… ఈ రెస్పాన్స్ చూసిన సైకో జగన్ కు దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతోందన్నారు లోకేష్. ఈ యువగలం సక్సెస్ తో త్వరలోనే వైసీపీకి ఎండ్ కార్డు పడుతుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. సీఎం జగన్ కు బిల్డ్ అప్ ఇవ్వడం తప్ప పనిచేయడం చేతకాదన్నారు. ఇప్పటి వరకు దేశ చరిత్రలోనే 100 పధకాలను తీసేసిన ఘనుడు సీఎం జగన్ అని విమర్శించాడు.

స్వలాభం కోసం స్వార్ధ రాజకీయాలను చేస్తూ రాష్ట్రాన్ని గంజాయి రాష్ట్రంగా మార్చాడని సంచలన కామెంట్స్ చేశాడు లోకేష్. మరి నారా లోకేష్ చేసిన ఈ వ్యాఖ్యలపై అధికార పార్టీ నుండి ఎవరైనా కౌంటర్ ఇస్తారా చూడాలి

Read more RELATED
Recommended to you

Latest news