జగన్ ట్రాప్ లో పడి కెరియర్ ను నాశనం చేసుకుంటున్నారు – నారా లోకేష్

-

ఏపీలోని ఉన్నాతాధికారులు జగన్ ట్రాప్ లో పడి కెరియర్ ను నాశనం చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు నారా లోకేష్. అంకబాబు అరెస్ట్ పై నారా లోకేష్‌ తాజాగా స్పందించారు. తండ్రి అధికారంలో ఉన్నప్పుడు ఐఏఎస్ అధికారులను జైలుకు తీసుకెళ్లాడు.

తన హయాంలో ఐఏఎస్ లతో పాటు ఐపీఎస్ లతో సహా పలువురు పోలీస్ అధికారులను జైలు పాలు చెయ్యబోతున్నాడని జగన్ రెడ్డి పై మండిపడ్డారు. కొంతమంది అధికారులు తాత్కాలిక ప్రయోజనాల కోసం జగన్ రెడ్డి ట్రాప్ లో పడి కెరియర్ ని నాశనం చేసుకుంటున్నారని పేర్కొన్నారు లోకేష్‌.

41ఏ నోటీసులు ఇవ్వకుండా జర్నలిస్ట్ అంకబాబు గారిని ఎందుకు అరెస్ట్ చేశారంటూ సిఐడి అధికారుల పై న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. పదే పదే కోర్టు మొట్టికాయలు వేస్తున్నా అధికారులు తీరు మారడం లేదని తెలిపారు. గీత దాటి ప్రవర్తిస్తున్న వారంతా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవడంతో పాటు ఎందుకు తప్పు చేశాం అని జీవితాంతం బాధపడటం ఖాయమని హెచ్చరించారు లోకేష్‌.

Read more RELATED
Recommended to you

Latest news