ఆంధకారంలో ఉన్న ఏపీని కాపాడండి..జగన్‌ కు లోకేష్‌ లేఖ

-

ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర సీఎం జగన్‌మోహన్‌ రెడ్డికి నారా లోకేష్‌ లేఖ రాశారు. ఏపీలో విద్యుత్‌ కోతల నేపథ్యంలో.. లోకేష్‌ ఈ లేఖ రాశారు. పరిశ్రమలు, ఉపాధి క‌ల్పనా రంగాల‌ని సంక్షోభంలోకి నెట్టే ప‌వ‌ర్‌ హాలిడేని ఎత్తేయాలంటూ సీఎం జగన్‌ మోహన్‌రెడ్డి గారికి లేఖ రాసానని… 5 ఏళ్ల చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఏనాడు కరెంట్ కోతలు లేవు. కానీ మీరు సీఎం అయ్యాక విద్యుత్ రంగాన్ని నాశనం చేసి రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ys jagan on nara lokesh

ప‌రిశ్రమల్లో ఉత్పత్తి నిలిపివేయడం ద్వారా నెలవారీ అద్దెలు, చెల్లించాల్సిన వాయిదాలు, అప్పుల‌కు వడ్డీలు కట్టలేక యాజమాన్యాలు విల‌విల్లాడుతున్నాయి. విద్యుత్‌ కోతలతో గ్రానైట్‌, ఆక్వా, పౌల్ట్రీ, వ‌స్త్ర‌, ఆహార‌ పరిశ్రమలు తీవ్రంగా నష్టపోయాయని నిప్పులు చెరిగారు.

ఇప్పటికైనా ఉన్నతాధికారులతో స‌మీక్షించి ప‌వ‌ర్ హాలీడేని ఎత్తేసే మార్గం ఆలోచించండని కోరారు. వాణిజ్య, పరిశ్రమల వినియోగదారుల నెత్తిన పెను భారాన్ని మోపుతూ ఎనర్జీ డ్యూటీ ని 6 పైసల నుండి రూపాయికి పెంచి సుమారుగా రూ.3 వేల కోట్లు దోచుకునే నిర్ణయాన్ని కూడా వెనక్కి తీసుకుని ప‌రిశ్రమలని కాపాడాలని డిమాండ్‌ చేశారు నారా లోకేష్‌.

 

Read more RELATED
Recommended to you

Latest news