విశాఖ నుండి ముంబై వెళ్తున్న ట్రైన్ లో బాంబు కలకలం..?

-

విశాఖ నుండి ముంబై వెళ్తున్న రైలులో బాంబు బెదిరింపు కలకలం రేపింది.విశాఖపట్నం నుండి వచ్చే రైళ్లలో బాంబు పెట్టామంటూ ఓ ఆగంతకుడి నుండి బెదిరింపు కాల్ వచ్చింది.దీంతో రైల్వే పోలీసులు అప్రమత్తమయ్యారు.కాజీపేటలో లోకమాన్య తిలక్ టెర్మినస్ రైలును, చర్లపల్లి లో కోణార్క్ ఎక్స్ప్రెస్ ను కాఫీ తనిఖీలు చేస్తున్నారు రైల్వే పోలీసులు.డాగ్ స్క్వాడ్ సహాయంతో అన్ని బోగీల్లొ విస్తృతంగా గాలిస్తున్నారు.

అనుమానాస్పదంగా కనిపించిన వస్తువులను తనిఖీ చేస్తున్నారు. ఈ ఫోన్ కాల్ డైల్ 100 కు వచ్చినట్టుగా తెలుస్తుంది.ఈ కాల్ ఎక్కడ నుండి వచ్చింది అనే దానిపై పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు.నిన్న న్యూయార్క్ లో కూడా ఇలాంటి సంఘటనే జరగడం అటువంటి ఘటన ఇక్కడ ఏమైనా జరుగుతుందా అనే అనుమానంతో పోలీసులు తీవ్రంగా తనికీలు చేపడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news