మహిళలకు పాదాభివందనం చేసిన నారా లోకేష్

-

టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర 38వ రోజు పీలేరు నియోజకవర్గంలో కొనసాగుతుంది. పాదయాత్ర మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకు లోకేష్ దాదాపు 500 కిలోమీటర్ల మేర నడిచారు. ప్రతిరోజు 10 కిలోమీటర్ల పైన యువనేత పాదయాత్ర చేస్తున్నారు. పాదయాత్రలో భాగంగా స్థానికులు, పలు సామాజిక వర్గాలు, యువకులు, మహిళలతో మాటా మంతి నిర్వహిస్తూ వారి సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు.

వైసీపీ పాలనలో వారు ఎదుర్కొంటున్న కష్టాలను లోకేష్ తెలుసుకుంటున్నారు. అయితే నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా.. మహిళలకు నారా లోకేష్ శుభాకాంక్షలు తెలియజేశారు. పీలేరు నియోజకవర్గంలో జరుగుతున్న యాత్ర సందర్భంగా మహిళలతో మాట్లాడిన ఆయన.. మోకాళ్ళపై కూర్చొని వారికి వందనం చేశారు. ” తల్లులకు, అక్క చెల్లెళ్లకు పాదాభివందనం చేస్తున్న. ఎప్పటికీ మిమ్మల్ని సంరక్షిస్తా” అని ఆయన భరోసా ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news