కత్తిని నమ్ముకున్న వాడు.. కత్తికి బలవుతాడు : జ‌గ‌న్ కు నారా లోక‌ష్ వార్నింగ్‌

-

ఏపీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి, వైసీపీ పార్టీ నేత‌ల‌పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ప్రజాస్వామ్యాన్ని ఫ్యాక్షన్ సీఎం జగన్…కత్తికి బలిస్తున్నారని నిప్పులు చెరిగారు. కత్తిని నమ్ముకున్న వాడు కత్తికి బలవ్వక తప్పదనే చరిత్ర చెబుతున్న సత్యాన్ని.. సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి, వైసీపీ నేతలు గుర్తు పెట్టుకోవాలని హెచ్చ‌రించారు.

ప్రజలు గెలిపించింది ప్రతిపక్ష నేతల్ని హతమార్చడానికా ? బాధ్యతాయుతంగా ఉండాల్సిన సీఎం ఫ్యాక్షన్ రాజకీయాలను వదులుకోకపోవడం కరెక్ట్ కాదని నిప్పులు చెరిగారు. జాతరకు హాజరైన టీడీపీ సీనియర్ నేత తిక్కారెడ్డిపై వైసీపీ అనుచరులు హత్యాయత్నాన్ని చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని పేర్కొన్నారు నారా లోకేష్‌. రెండుసార్లు తిక్కారెడ్డిపై హత్యాయత్నం జరిగినా పోలీసులు కనీస భద్రత కల్పించకపోవడం అనేక అనుమానాలకు దారి తీస్తుందని మండి ప‌డ్డారు. దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని… ప్రాణహాని ఉన్న టీడీపీ నేత తిక్కారెడ్డికి భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు.

 

Read more RELATED
Recommended to you

Latest news