నరసరావుపేట మర్డర్ కేసు..నిందితుడి తరుపున వాదించకూడదని లాయర్ల నిర్ణయం

-

గుంటూరు జిల్లాలో ప్రేమోన్మాది దాడిలో మృతి చెందిన  అనూష మృతదేహానికి పోస్ట్ మార్టం పూర్తయింది.  డెడ్ బాడీని ఆమె నివాసానికి తరలించారు. భారీగా విద్యార్ధులు, స్థానికులు, నేతలు తరలివచ్చి బాధిత కుటుంబాన్ని ఓదార్చుతున్నారు. కాసేపట్లో అనూష మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించనున్నారు. మరో వైపు నిందితుడు విష్ణువర్ధన్‌రెడ్డిపై దిశ సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదుచేశారు. హత్యకు దారితీసిన కారణాలపై నిందితుడ్ని ప్రశ్నిస్తున్నారు పోలీసులు.

ఇక నిందితుడి తరపున ఎవరూ వాదించకూడదని పట్టణానికి చెందిన లాయర్లు నిర్ణయం తీసుకున్నారు. వినుకొండ ప్రాంతానికి చెందిన విష్ణువర్ధన్‌రెడ్డి, అనుష గత కొంత కాలంగా ప్రేమలో ఉన్నట్టు తెలుస్తోంది. అయితే యువతి తనను దూరం పెడుతుందన్న కోపంతో హత్య చేశాడు విష్ణువర్ధన్‌. అయితే అదేమీ లేదని అతనే తమ కూతుర్ని ప్రేమించమని వెంట పడుతున్నాడని బయట చెప్పుకుంటే పరువు పోతుందని విషయం గుట్టుగా ఉంచమాని ఆమె తల్లితండ్రులు చెబుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news