ఇండియాకు మరిన్ని చీతాలు.. ఎప్పుడు వస్తాయంటే?

-

దేశంలో చీతాల సంఖ్యను మరింత పెంచే దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇప్పటికే నమీబియా నుంచి 8 చీతాలను భారత్​కు తీసుకొచ్చిన మోదీ ప్రభుత్వం.. తాజాగా దక్షిణాఫ్రికా నుంచి మరిన్ని చీతాలను రప్పిస్తోంది. ఫిబ్రవరి 18న 12 చీతాలు దక్షిణాఫ్రికా నుంచి భారత్​కు చేరుకుంటాయని కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ వెల్లడించారు.

భారత్​కు తీసుకురానున్న వాటిలో ఏడు మగ, ఐదు ఆడ చీతాలు ఉండనున్నాయని కేంద్ర మంత్రి తెలిపారు. మధ్యప్రదేశ్​లోని కునో జాతీయ పార్క్​కు ఈ 12 చిరుతలను అధికారులు తరలించనున్నట్లు వెల్లడించారు.

1948లో దేశంలో చీతాలు అంతరించిపోయాయి. గతేడాది సెప్టెంబర్ 17న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన పుట్టిన రోజు సందర్భంగా ఎనిమిది చీతాలను కునో పార్క్​లోకి విడిచిపెట్టారు. వాటిలో ఐదు ఆడ, మూడు మగ చీతాలు ఉన్నాయి. దీంతో 74 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత చీతాలు దేశంలోకి వచ్చినట్లైంది.

Read more RELATED
Recommended to you

Latest news