కరోనా వ్యాక్సినేషన్‌ లో ఇండియా చరిత్ర..200 కోట్లు క్రాస్

-

కరోనా వ్యాక్సినేషన్‌ లో ఇండియా చరిత్ర సృష్టించింది. 200 కోట్ల కరోనా వ్యాకిన్లు వేసింది కేంద్ర ప్రభుత్వం. 2021 జనవరి 16 వ తేదీన కరోనా వ్యాక్సినేషన్‌ ప్రారంభం అయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు 200 కోట్ల కరోనా వ్యాకిన్లు వేసింది కేంద్ర ప్రభుత్వం. ఈ నేపథ్యంలోనే ప్రధాని నరేంద్ర మోడీ ట్వీట్‌ చేశారు.

” భారత్ మళ్లీ చరిత్ర సృష్టించింది! 200 కోట్ల వ్యాక్సిన్ మోతాదుల ప్రత్యేక సంఖ్యను దాటినందుకు భారతీయులందరికీ అభినందనలు. భారతదేశం యొక్క వ్యాక్సినేషన్ డ్రైవ్‌ను స్కేల్ మరియు వేగంతో అసమానంగా మార్చడానికి సహకరించిన వారికి గర్వకారణం. ఇది COVID-19కి వ్యతిరేకంగా ప్రపంచ పోరాటాన్ని బలోపేతం చేసింది.” అని ట్వీట్‌ చేశారు ప్రధాని నరేంద్ర మోడీ.

Read more RELATED
Recommended to you

Latest news