ఓ ఇంట్లో నాలుగు కుళ్లిన మృతదేహాలు.. ఆత్మహత్యా లేక హత్యా..?

-

కర్ణాటకలోని మైసూరులో ఓ ఇంట్లో నాలుగు కుళ్లిన మృతదేహాలు కలకలం సృష్టించాయి. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు అనుమానాస్పద రీతిలో మరణించడం స్థానికంగా సంచలనం రేకెత్తించింది. మృతులను మహదేవస్వామి కుటుంబసభ్యులుగా గుర్తించినట్లు చెప్పారు. అసలేం జరిగిందంటే..?

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బరదనపుర్​ గ్రామానికి చెందిన మహదేవస్వామి(48).. మైసూరు నగరంలో ఆర్‌ఎంసీ మార్కెట్‌లో ఏజెంట్‌గా పనిచేస్తున్నాడు. మహదేవస్వామి.. తన భార్య అనిత(35), ఇద్దరు కుమార్తెలతో చాముండిపురం కాలనీలో ఓ అద్దె ఇంట్లో నివసిస్తున్నాడు. ఆదివారం మధ్యాహ్నం.. మహదేవస్వామి ఇంటి నుంచి దుర్వాసన రావడం వల్ల స్థానికులకు అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం అందించారు.

పోలీసులు.. ఘటనాస్థలికి చేరుకుని తలుపులు బద్దలుకొట్టి లోపలకి వెళ్లగా .. హాలులో మహదేవస్వామి మృతదేహం.. కుర్చీపై భార్య అనిత, గదిలో కుమార్తెలు విగతజీవులుగా కనిపించారు. రెండ్రోజుల క్రితమే వీరు ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. వ్యాపారంలో నష్టం రావడం వల్లే మహదేవ స్వామి అప్పులపాలయ్యాడని స్థానికులు చెబుతున్నారు. దీనిపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news