ఇవాళ మంత్రి రోజా ఇంటికి సిఎం జగన్..!

-

BREAKING : ఇవాళ చిత్తూరు జిల్లా నగరిలో సిఎం జగన్ పర్యటించనున్నారు. ఈ సందర్భంగా జగనన్న విద్యా దీవెన ఏప్రిల్ – జూన్ 2023 త్రైమాసిక లబ్ధి ని ప్రారంభించే కార్యక్రమాన్ని కంప్యూటరు లో బటన్ నొక్కి ప్రారంభించనున్నారు సిఎం జగన్‌. చిత్తూరు జిల్లాలో 31,180 మంది తల్లుల ఖాతాలకు జమ కానున్నాయి.

ఇందులో భాగంగానే ఇవాళ ఉదయం 8:30 గంటల ప్రాంతంలో తాడేపల్లి నుంచి బయలుదేరి నగరి కి చేరుకుంటారు సీఎం జగన్. విద్యా దీవెన పథకానికి సంబంధించిన నిధులను సీఎం జగన్ బటన్ నొక్కి జమ చేస్తారు. అనంతరం బహిరంగ సభలో సీఎం జగన్ ప్రసంగిస్తారు.

ఇక ఈ పథకం కింద ఐటిఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంజనీరింగ్, మెడిసిన్ తదితర కోర్సులు చదివే విద్యార్థుల ఫీజుల మొత్తాన్ని విడదల వారీగా తల్లుల ఖాతాలలో జమ చేస్తున్నారు. అయితే నగరి పర్యటన లో భాగంగా ఇవాళ మంత్రి రోజా ఇంటికి సిఎం జగన్ వెళ్లనున్నారట. ఈ సందర్భంగా రోజా ఇంట్లో సిఎం జగన్ విందు భోజనం చేయనున్నారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news