BREAKING : ట్రక్కును ఢీకొన్న బస్సు.. ఆరుగురు స్పాట్ డెడ్

-

గుజరాత్​లోని అహ్మదాబాద్​- వడోదర ఎక్స్​ప్రెస్​ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈరోజు తెల్లవారుజామున ఎక్స్ ​ప్రెస్​వేపై ఆగి ఉన్న ఓ ట్రక్కును బస్సు ఢీ కొట్టింది. ఈ ఘటనలో బస్సులో ఉన్న ఆరుగురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మరో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ‘అహ్మదాబాద్ – వడోదర హైవేపై ట్రక్కును బస్సు ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఆరుగురు స్పాట్ డెడ్ అయ్యారు. 8 మంది గాయపడగా వారని సమీప ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నాం. ఇక ఆరు మృతదేహాలను స్వాధీనం చేసుకుని శవ పరీక్షల కోసం ప్రభుత్వ ఆస్పత్రికి పంపించినట్లు’ ఆనంద్ ఎస్​పీ గౌరవ్​ జసానీ తెలిపారు. ఈ ఘటనకు గల కారణాలపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. అతి వేగమే కారణమని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చామని గౌరవ్ జసానీ చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news