BREAKING : గోడ కూలి తొమ్మిది మంది చిన్నారులు మృతి

-

మధ్యప్రదేశ్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. సాగర్‌ జిల్లా షాజాపూర్‌లో గోడ కూలిన ఘటనలో తొమ్మిది మంది చిన్నారులు మృతి చెందారు. మరికొంత మంది గాయపడ్డారు. స్థానిక సమాచారంతో పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. వెంటనే సహాయక చర్యలు చేపట్టి శిథిలాల కింద ఉన్న వారిని బయటకు తీశారు. మరోవైపు గాయపడిన వారిని సమీప ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ఘటనా స్థలిలో శిథిలాలను పూర్తిగా తొలగించారు. ఆలయం గోడ కూలడంతో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.

ఇవాళ ఆదివారం కావడంతో భక్తులు తమ కుటుంబంతో కలిసి ఆలయానికి వచ్చారని పోలీసులు తెలిపారు. అయితే అందులో కొంతమంది చిన్నారులు మట్టితో శివలింగాన్ని తయారు చేయడానికి ఒకచోట గుమిగూడారని.. లింగం తయారు చేస్తున్న సమయంలో పక్కనే ఉన్న గోడ కూలడంతో అక్కడికక్కడే తొమ్మిది మంది చిన్నారు ప్రాణాలు కోల్పోయారని వెల్లడించారు. మధ్యప్రదేశ్లో ప్రస్తుతం భారీగా వర్షాలు కురుస్తున్నాయని అధికారులు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news