BREAKING : భర్త ప్రేమించిన అమ్మాయిని దారుణంగా చంపిన భార్య

-

చెన్నైలో దారుణం చోటు చేసుకుంది. భర్త ప్రేమించిన అమ్మాయిని చంపింది ఓ భార్య. కోయంబత్తూరులో విద్యార్థిని సుబ్బలక్ష్మి హత్య..సంచలంగా మారింది. ఇక విద్యార్ది హత్య కేసులో ఎనిమిది నెలలు గర్భిణీ సహా భర్తను అరెస్టు చేశారు పోలీసులు. ఈ హత్యకు ట్రయాంగిల్ లవ్ స్టోరినే కారణంగా తెలుస్తోంది. కోయంబత్తూరు ఇడయార్‌ పాలయంలో ఈ ఘటన చోటు చేసుకుంది.

సుజై ,అతని భార్య రేష్మ ప్రేమించి పెళ్ళి చేసుకున్నారు..రేష్మకు ముందు సుబ్బలక్ష్మిని ప్రేమించాడు సుజై. సుబ్బలక్ష్మి కాదని రేష్మను పెళ్ళి చేసుకుని కోయంబత్తూరు నివాసం ఉంటున్నాడు సుజై. ప్రేమికుడు కోసం వెతుక్కుంటూ కోయంబత్తూరులోని ప్రియుడు సుజై ఇంటికి వచ్చిన సుబ్బలక్ష్మి ..సుజైకి పెళ్ళి కావడంపై ఇద్దరి మధ్య గోడవ చోటు చేసుకుంది. తన భర్త వదిలి పోవాలంటూ ఆగ్రహంతో సుబ్బలక్ష్మిని కత్తి పొడిని చంపింది సుజై భార్య రెష్మ. అనంతరం పరారీ అయింది. దీనిపై కేసు నమోదు చేసుకుని.. దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

Read more RELATED
Recommended to you

Latest news