ఏఐసిసి అధ్యక్ష ఎన్నికల షెడ్యూల్ ఖరారు

-

ఏఐసిసి అధ్యక్ష ఎన్నికల షెడ్యూల్ ఖరారు అయింది. ఈ మేరకు “వీడియో కాన్ఫరెన్స్” ( ఆన్‌లైన్‌) ద్వారా ఆగస్టు 28 న మద్యాహ్నా 3.30 గంటలకు “కాంగ్రెస్‌ వర్కింగ్ కమిటీ” సమావేశం జరగనుంది. సెప్టెంబర్ 7 నుంచి రాహుల్ గాంధీ “భారత్ జోడో” పాదయాత్ర ప్రారంభం కానుంది. సెరెటంబర్ 4 న రాంలీలా మైదాన్ లో ధరల పెరుగుదల పై భారీ ర్యాలీ నిర్వహించనున్నారు.

ఈ లోగానే ఏఐసిసి అధ్యక్ష ఎన్నిక ప్రక్రియ పూర్తి అయ్యే అవకాశం ఉంది. పిసిసి సభ్యుల తీర్మానాల ద్వారా అధ్యక్ష ఎన్నిక పూర్తి చేసే అవకాశం ఉంది. తీర్మానాల ద్వారా పిసిసి అధ్యక్షులు, రాష్ట్ర కమిటీ లు, ఏఐసిసి అధ్యక్ష ఎన్నిక పూర్తి చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం అందుతుంది. ఇక అటు రాహుల్ గాంధీ భారత్ జోడో పాదయాత్ర లో 500 మంది పాల్గొననున్నారు.

పార్టీ అనుబంధ సంఘాల నాయకులకు ఇందులో ప్రాధాన్యత ఉండనుంది. తెలంగాణ నుండి nsui రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్ కి చోటు దక్కనుంది సెప్టంబరు 5 న కశ్మీర్ కి చేరుకోవాలని ఆదేశాలు వచ్చాయి. రెండు రోజుల శిక్షణ తర్వాత పాదయాత్రలో పాల్గొనున్నారు. వైట్ కుర్తా.., పైజామా తో యాత్ర లో పాల్గొనాలని పార్టీ నిర్ణయం తీసుకుంది.

 

 

Read more RELATED
Recommended to you

Latest news