అన్ని పోస్ట్ మార్టంలు అక్కడే ఎందుకు చేసారు…?

-

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్, దిషా సాలియన్, జియా ఖాన్, పర్వీన్ బాబీ అన్ని పోస్టు మార్టంలు కూపర్ హాస్పిటల్‌ లో చేసారు. మీరు ఎందుకో ఊహిస్తారా…? రిపబ్లిక్ టీవీ అధినేత అర్నబ్ గోస్వామి ట్విట్టర్ లో చేసిన వ్యాఖ్య ఇది. కూపర్ హాస్పిటల్ లో జరిగిన ఈ వరుస పోస్ట్ మార్టంలు అన్నీ కూడా ఇప్పుడు అనుమానంగానే ఉన్నాయి. సుశాంత్ సింగ్ కేసుని సిబిఐ టేకప్ చేసింది.

 

అది మొదలు అనేక విషయాలు వెలుగులోకి వస్తూ సుశాంత్ సింగ్ ని, అతని మాజీ మేనేజర్ దిశాని హత్య చేసారు అనే వరకు ఆసక్తికర మలుపులు తిరుగుతున్నాయి. ఈ హత్యలను ఎవరు చేసారు అని పలువురు ప్రశ్నలు వేస్తున్నారు. ట్విట్టర్ లో ఇప్పుడు సుశాంత్ సింగ్, దిశా సాలియన్ హత్యలకు సంబంధించిన విషయాలు వెలుగులోకి తీయాలి అని, కూపర్ హాస్పిటల్ వ్యవహారం బయటపెట్టాలి అని కోరుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news