అగ్నిపథ్ కు వ్యతిరేకంగా రేపు భారత్ బంద్

-

దేశానికి సేవలు అందించాలనే ఆసక్తిగల యువతను త్రివిధ దళాల్లో నియమించేందుకు కేంద్రం తాజాగా అగ్నిపధ్ పథకం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ పథకానికి సానుకూల స్పందన రావడం మాట అటుంచితే.. యువత నుంచి తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. కేవలం నాలుగేళ్లు సైనిక సర్వీసులో ఉంచి.. ఆ తరువాత ఇంటికి పంపిస్తే తమ భవిష్యత్తు ఏంటి? అని ప్రస్తుతం ఆర్మీ పరీక్షలకు సిద్ధమవుతున్న చాలా మంది అభ్యర్థులు నిరసనలు చేస్తున్నారు.

ఈ ఆర్మి పథకాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని దేశవ్యాప్తంగా ఆర్మీ అభ్యర్థులు డిమాండ్ కూడా చేస్తున్నారు. చాలా రాష్ట్రాల్లో ఈ అగ్నిపధ్ పధకం పై తీవ్రస్థాయిలో నిరసనలు కూడా చేపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే జూన్ 18వ తేదీన భారత్ బంద్ కు పిలుపునిచ్చారు. బీహార్, యూపీ, తెలంగాణ సహా పలు రాష్ట్రాల్లో ఉద్యోగార్థులు ఆందోళనలు చేస్తుండగా.. బీహార్ లోని ఆర్జెడి ఆధ్వర్యంలోని ప్రతిపక్ష పార్టీలు ఈ బంద్ కు మద్దతు ఇచ్చాయి.

Read more RELATED
Recommended to you

Latest news