Bharat Jodo Yatra : నేటితో ముగియనున్న ‘భారత్ జోడో యాత్ర’

-

నేటితో ‘భారత్ జోడో యాత్ర’ ముగియనుంది. కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన ‘భారత్ జూడో యాత్ర’ నేటితో ముగియనుంది. కాసేపట్లో శ్రీనగర్ లాల్చౌక్ కు రాహుల్ యాత్ర చేరుకోనుంది. అక్కడ జాతీయ జెండాను ఆవిష్కరించి, రాహుల్ యాత్రను ముగిస్తారు.

2022 సెప్టెంబర్-7న కన్యాకుమారి నుంచి యాత్ర మొదలై కశ్మీర్ వరకు మొత్తం 3,570 కిలోమీటర్ల మేర సాగింది. రేపు శ్రీనగర్ లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. సభకు రావాలని 21 ప్రతిపక్ష పార్టీలకు ఆహ్వానం పంపారు. ఇక ఈ ముగింపు కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్రం నుంచి రేవంత్‌ రెడ్డి వెళ్లనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news