బుడిబుడి అడుగులతో ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన రెండున్నరేళ్ల చిన్నారి

-

ప్రపంచంలోనే అతి ఎత్తైన శిఖరం ఎవరెస్టును అధిరోహించాలంటే బలంగా ఉండాలి, అక్కడి వాతావరణ పరిస్థితులను తట్టుకుని ముందుకు సాగగలిగే తెగింపు ఉండాలి. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, కరుగుతున్న హిమానీనదాలు, మంచు ప్రతికూల పరిస్థితులను తట్టుకోలేక మహామహులే ఎవరెస్టు శిఖరం ఎక్కేందుకు జంకుతుంటారు. అలాంటిది ఓ రెండున్నరేళ్ల చిన్నారి ఎవరెస్టు శిఖరాన్ని చేరుకుంది. భారతదేశంలో అతిపిన్న వయస్సులోనే ఎవరెస్టు పర్వత బేస్ క్యాంపుపైకి ఎక్కిన చిన్నారిగా సిద్ధి మిశ్ర పేరు తెచ్చుకుంది. బుడిబుడి అడుగులు వేస్తూ ఎవరెస్టును అధిరోహించిన ఆ చిన్నారి సాహసాన్ని ప్రతి ఒక్కరూ కొనియాడుతున్నారు.

సిద్ధి మిశ్ర తన తండ్రి మహీం మిశ్రతోపాటు, తల్లి భావనా దేహరియాలతో కలిసి మార్చి 22వ తేదీన ఈ ఘనతను సాధించింది. ఎవరెస్టు ఈశాన్య ప్రాంతంలో ఉన్న నేపాల్లోని లక్లా నుంచి మార్చి 12న పర్వతారోహణను మొదలుపెట్టిన ఈ కుటుంబం 10 రోజుల్లో 53 కి.మీల దూరాన్ని పూర్తి చేసి లక్ష్యాన్ని ఛేదించింది. తమ కుమార్తెతో కలిసి ఎవరెస్టును అధిరోహించడంపై భావన సంతోషం వ్యక్తి చేశారు. మధ్యప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన బేటీ బచావో, బేటీ పడావో కార్యక్రమానికి ఈ విజయాన్ని అంకితమిచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news