క్రోమ్‌ యూజర్లకు అలర్ట్.. వెంటనే బ్రౌజర్‌ను అప్‌డేట్ చేయాలని కేంద్రం సూచన

-

గూగుల్‌ క్రోమ్‌ యూజర్లకు అలర్ట్.. కంప్యూటర్లలో క్రోమ్‌ బ్రౌజర్‌ను ఉపయోగిస్తున్న యూజర్లు.. వెంటనే అప్‌డేట్ చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం కీలక సూచించింది. భారత ప్రభుత్వ సైబర్‌ సెక్యూరిటీ ఏజెన్సీ.. కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పానెస్స్ టీమ్‌ ఆఫ్ ఇండియా (CERT-IN) క్రోమ్‌ బ్రౌజర్‌లో లోపాలను గుర్తించినట్లు వెల్లడించింది. వీటి వల్ల డేటా చౌర్యం, మాల్‌వేర్‌ దాడులు జరిగే అవకాశం ఉందని తెలిపింది. ఈ నేపథ్యంలో యూజర్లు బ్రౌజర్ ను అప్డేట్ చేసుకోవాలని సూచనలు చేసింది.

గూగుల్‌ క్రోమ్‌లోని ప్రాంప్ట్స్‌, వెబ్‌ పేమెంట్స్‌ ఏపీఐ, స్విఫ్ట్‌షేడర్‌, వుల్కన్‌, వీడియో, వెబ్‌ ఆర్‌టీసీ వంటి వాటి ద్వారా సైబర్‌ నేరగాళ్లు యూజర్‌ కంప్యూటర్‌లోకి మాల్‌వేర్‌ను పంపి బ్యాంకింగ్‌ సమాచారంతోపాటు, వ్యక్తిగత వివరాలను సేకరించే అవకాశం ఉందని CERT-IN పేర్కొంది. యూజర్లు క్రోమ్‌ బ్రౌజర్‌లో అశ్లీల వెబ్‌సైట్‌లు, తక్కువ భద్రతా ప్రమాణాలు కలిగిన వెబ్‌ పేజ్‌లను ఓపెన్‌ చేసినప్పుడు మాల్‌వేర్‌ ప్రవేశించే అవకాశం ఉందని తెలిపింది. లైనెక్స్‌, మ్యాక్‌ కంప్యూటర్లలో గూగుల్‌ క్రోమ్‌ వెర్షన్‌ 115. 0.5790.170 వాడుతున్న వారు, విండోస్‌లో 115.0.5790.170/.171 వెర్షన్‌ ఉపయోగిస్తున్నవారు వెంటనే తమ బ్రౌజర్లను అప్‌డేట్ చేసుకోవాలని సెర్ట్‌-ఇన్‌ సూచించింది.

Read more RELATED
Recommended to you

Latest news