మూత్రం పోసిన ఘటనలో.. బాధితుడి కాళ్లుకడిగిన శివరాజ్ సింగ్ చౌహాన్

-

రెండు రోజుల కిందట మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఓ దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఓ గిరిజన యువకుడిపై ఓ వ్యక్తి మూత్రం పోసి… హింసించాడు. ఎవరూ లేని గిరిజన యువకుడిని టార్గెట్‌ చేసి… అతనిపై మూత్రం పోసాడు. దీనికి సంబంధించిన వీడియో మొన్నటి నుంచి వైరల్‌ అయింది.

దీంతో రంగంలోకి దిగిన మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సర్కార్‌.. నిందితున్ని అరెస్ట్‌ చేసి.. జైలుకు పంపింది. ఇక తాజాగా ఈ సంఘటనలో మరో సంచలన ట్విస్ట్‌ చోటు చేసుకుంది. మధ్యప్రదేశ్ – గిరిజన యువకుడి మీద మూత్రం పోసిన ఘటనలో బాధితుడుని ఇంటికి పిలిపించుకున్నారు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్. అనంతరం ఆ గిరిజన యువకుడి కాళ్ళు కడిగి సన్మానం చేసిన మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్…అతనికి భరోసా కల్పించారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్‌ గా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news