ఏపీలో ముందస్తు ఎన్నికలు – ఎంపీ రఘురామ

-

నిన్నటి నుంచి ఏపీలో ముందస్తు ఎన్నికలు జరుగుతాయని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇలాంటి తరుణంలోనే… YCP రెబల్ MP రఘురామకృష్ణరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో ముందస్తు ఎన్నికలు ఖాయమని YCP రెబల్ MP రఘురామకృష్ణరాజు పేర్కొన్నారు.

ఢిల్లీ పర్యటనలో ప్రధాని మోదీతో జగన్ ఇదే అంశాన్ని చర్చించారని ఓ వీడియో విడుదల చేసిన RRR…’NDA లో చేరడానికి జగన్ చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. తెలంగాణతో పాటు అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లడానికి సిద్ధమయ్యారు. ముందస్తుపై లీకులు వాళ్లే ఇచ్చారు. మళ్లీ నమ్మవద్దని అంటున్నారు. రెండు రోజుల్లో దీనిపై అదనపు సమాచారం వస్తుంది’ అని పేర్కొన్నారు. కాగా.. నిన్న సీఎం జగన్‌.. ప్రధాని మోడీని కలిసిన తర్వాతనే.. ఏపీలో ముందస్తు ఎన్నికలు జరుగుతాయని వార్తలు మొదలు అయ్యాయి.

Read more RELATED
Recommended to you

Latest news