కరోనా టెర్రర్.. కాస్త నెమ్మదించిన మహమ్మారి.. తగ్గిన కేసులు

-

గత కొద్ది రోజులుగా మళ్లీ యాక్టివ్ అయిన కరోనా మహమ్మారి భారత్​లోనూ విజృంభించడం మొదలు పెట్టింది. కొవిడ్ వ్యాప్తి స్పీడ్ పెంచడంతో భారత్ ప్రజలు అప్రమత్తమయ్యారు. కరోనా నిబంధనలు పాటిస్తూ జాగ్రత్తలు తీసుకున్నారు. అయితే గత రెండ్రోజుల నుంచి ఈ మహమ్మారి వ్యాప్తి కాస్త నెమ్మదించినట్లుగా కనిపిస్తోంది. భారత్​లో ప్రస్తుతం కరోనా కేసులు తగ్గుముఖం పట్టినట్లు తెలుస్తోంది.

గత 24 గంటల వ్యవధిలో 1,89,087 మందికి కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు చేయగా.. 6,660 కేసులు బయటపడినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. తాజా కేసులతో మొత్తం కరోనా బారిన పడిన వారి సంఖ్య 4.49 కోట్లకు చేరింది. ప్రస్తుతం దేశంలో 63,380 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. మహమ్మారి నుంచి ఇప్పటి వరకు 4,43,11,078 మంది కోలుకున్నారు. గత 24 గంటల వ్యవధిలో 24 మంది ప్రాణాలు కోల్పోగా.. మొత్తం కొవిడ్‌ మరణాల సంఖ్య 5,31,369కి ఎగబాకింది.

Read more RELATED
Recommended to you

Latest news