దిల్లీలో ఉరుములు మెరుపులతో భారీ వర్షం

-

దేశ రాజధాని దిల్లీలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. నిన్నటి వరకు భానుడి భగభగలతో అల్లాడిపోయిన దిల్లీ ఇప్పుడు కాస్త చల్లబడింది. ఇవాళ తెల్లవారుజాము నుంచి దిల్లీలో భారీ వర్షం కురుస్తోంది. దిల్లీ-ఎన్‌సీఆర్‌లోని పలు ప్రాంతాలతో పాటు హర్యానాలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. గంటకు 40 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తున్నాయి. దీంతో పలు చోట్ల చెట్లు విరిగిపడ్డాయి. వాహనాల రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడ్డాయి.

భారీ వర్షం కారణంగా దిల్లీ నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లాల్సిన పలు విమానాలు రద్దయ్యాయి. మరికొన్ని ఆలస్యంగా నడుస్తున్నాయి. కాగా, మే 30వ తేదీ వరకు దిల్లీ-ఎన్‌సీఆర్‌ ప్రాంతంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించింది. సూర్యుడి ప్రతాపం తర్వాత వాన కురుస్తున్నందున ప్రజలు వర్షంలో తడవకుండా జాగ్రత్తగా ఉండాలని తెలిపింది. మరోవైపు ఉష్ణోగ్రతలు ఇంకా పెరిగే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news